చిట్యాల, డిసెంబర్ 24: విహార యాత్రకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నేపాల్లోని లో బూచె పర్వతంపై గుండెపోటు తో మృతిచెందాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకలకు చెందిన అద్దెల రాజశేఖర్రెడ్డి (32) హైదరాబాద్లో సాప్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 3న పర్వతారోహణ కోసం నేపాల్లోని సల్లేరి ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి 10 రోజుల పాటు నడిచి 21న 4,900 మీటర్ల ఎత్తులో ఉన్న లోబూచె పర్వతాన్ని చేరుకుని లాడ్జిలో బస చేశాడు.
చలి తీవ్రతకు రాజశేఖర్రెడ్డి అస్వస్థతకు గురై గుండెపోటు రావడంతో లాడ్జిలోనే చనిపోయాడు. గమనించిన లాడ్జి సిబ్బంది రాజశేఖర్రెడ్డి ఫోన్లో ఉన్న నంబర్లతో కుటుంబసభ్యులకు ఈ నెల 22న సమాచారం అందించారు. వెంటనే కుటుంబసభ్యులు నేపాల్కు బయల్దేరి వెళ్లారు. రాజశేఖర్రెడ్డి మృతదేహాన్ని ఆదివారం హైదరాబాద్ తీసుకురానున్నారు.