నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి 764 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. కాకతీయ కాలువకు 50, మిషన్ భగీరథ తాగునీటి కోసం 152 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.
ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి ఈ సీజన్లో 676.011 టీఎంసీల వరద వచ్చిందని వివరించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి పూర్తిస్థాయి నీటిమట్టం కలిగి ఉందని ఏఈఈ తెలిపారు.