Siddipet | దుబ్బాక, ఏప్రిల్ 20: బైక్ కొనుక్కునే స్థోమత లేక ఓ చిరువ్యాపారి తన సైకిల్ను బ్యాటరీ సైకిల్గా మార్చుకొని దర్జాగా ప్రయాణం చేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్ గ్రామానికి చెందిన పప్పా చంద్రం చిరువ్యాపారి. రూ.16 వేల ఖర్చు చేసి తన పాత సైకిల్ను బ్యాటరీ సైకిల్గా రూపొందించుకున్నాడు. సైకిల్ బొంగు(పైపు)కు మోటారు బ్యాటరీ బిగించాడు.
బ్రేక్ వద్ద రేస్(స్పీడ్ కంట్రోల్)తోపాటు హ్యాండిల్కు సౌండ్ సిస్టం, రాత్రివేళ ప్రయాణించేందుకు హెడ్బల్బ్ ఏర్పాటు చేసుకున్నాడు. సైకిల్ తొక్కటం ఇబ్బందికరంగా మారడంతో తనకున్న పరిజ్ఞానంతో బ్యాటరీ సైకిల్ తయారు చేసుకుని ఔరా అనిపించుకున్నాడు. చంద్రం గ్రామంలో చిన్నపాటి కిరాణా దుకాణం నడుపడంతో పాటు సమీప గ్రామాలకు చిప్స్ ప్యాకెట్లు సరఫరా చేస్తుంటాడు.