హైదరాబాద్, అక్టోబర్29 (నమస్తే తెలంగాణ): ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేకమంది కీలక నేతలు ఆ పార్టీకి గుడ్బై చెప్పి టీఆర్ఎస్లో చేరారు. శనివారం సర్పంచ్, పలువురు వార్డు సభ్యులతోపాటు తెలంగాణ జనసమితికి చెందిన నాయకుడు గులాబీ కండువాలు కప్పుకొన్నారు. నియోజక వర్గంలోని చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట సర్పంచ్ చక్రం జంగయ్యతోపాటు వార్డు సభ్యులు గంధం సతీశ్, సురేశ్ వద్దిరాజు, ముద్దంగుల యాదయ్య, లింగస్వామి, సీనియర్ నాయకులు దండుగుల వెంకటేశ్, శేఖర్, దండుగుల రాజు, తెలంగాణ జన సమితి నేత పాశం కిరణ్, చండూరుకు చెందిన బీజేపీ నాయకుడు రామస్వామి వెంకటేశ్వర్లు తదితరులకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, కోదాడ ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ పార్టీ కండువాలు కప్పారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు నేత ఆకుల రజిత్లతో కలిసి మంత్రి కేటీఆర్ను కలిశారు.