హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): సచివాలయ ఉద్యోగికి ఒకే రోజు రెండు ప్రమోషన్లు దక్కాయి. ఆ రెండూ పూర్వపు తేదీలతో అమలుకానుండటం విశేషం. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్వో)గా పనిచేస్తున్న పీ ప్రవీణ్కుమార్కు 22న సెక్షన్ ఆఫీసర్గా, ఆ వెంటనే మరో జీవోతో అసిస్టెంట్ సెక్రటరీగా ప్రమోషన్లు ఇచ్చారు.
మొదటి ప్రమోషన్ 2012 మే 29 నుంచి, రెండో ప్రమోషన్ 2017 జనవరి 6 నుంచి అమలులోకి వస్తుందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.