వెంకటాపురం (నూగూరు) జనవరి 6: రన్నింగ్లో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. దీంతో అదుపుతప్పి బస్సు పొదల్లోకి దూసుకెళ్లి ఆగిపోవడం తో ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారు. కాగా డ్రైవర్ను దవాఖానకు తరలి స్తుండగా మరణించాడు. ఈ ఘటన శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని అంకన్నగూడెం గ్రామ సమీపంలో జరిగింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాకం గ్రామపంచాయతీ ఉత్తరబ్రాహ్మణపల్లికి చెంది న 45 మంది శక్తి మాలలు ధరించారు. 41 రోజుల పాటు దీక్షను పూర్తి చేసి ఇరుముడి అప్పగించేందుకు తమిళనాడులోని మేల్ ము త్తూరు అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం 7 రోజుల పాటు బస్సులో తీర్థయాత్రలకు వెళ్లేందుకు కాణిపాకం నుంచి బయలుదేరారు. అందులో భాగంగా ఈ నెల 5న భద్రాచలం వచ్చి రాముల వారిని దర్శనం చేసుకొని అక్కడే నిద్రించారు. శుక్రవారం ఉదయం పర్ణశాల ఆలయాన్ని దర్శించుకొని మధ్యాహ్నం అక్కడి నుంచి యాదగిరిగుట్ట కు వెళ్తుండగా అంకన్నగూడెం సమీపంలోకి రాగానే డ్రైవర్ దేవఇరక్కం(49)కు గుండెపోటు వచ్చింది. బస్సు అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లి ఆగిపోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న డ్రైవర్ను 108లో వెంకటాపురం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.