Rrice corp | సాధారణంగా వరి నాటు వేసిన తర్వాత మూడు నెలలకు పొట్ట దశకు వస్తుంది. కానీ.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నక్కలగూడకు చెందిన రైతు కిరణ్ సాగుచేసిన వరి 45 రోజులకే పొట్టదశకు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. కిరణ్ వివిధ రకాల కంపెనీలకు చెందిన 27 విత్తన సంచులను కొనుగోలు చేసి పంట వేశాడు.
ఇందులోని 7 సంచుల విత్తనాల్లో తేడా వచ్చినట్టు రైతు తెలిపాడు. సుమారు మూడు ఎకరాల్లో సాగుచేసిన వరి 45 రోజులకే పొట్టదశకు వచ్చినట్టు పేర్కొన్నాడు. ఈ ప్రాంత రైతులు పెద్దపల్లి జిల్లా నుంచి కూడా విత్తనాలు తీసుకొచ్చి నాట్లు వేశారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు. – రెబ్బెన