వేములవాడ, జనవరి 25: అరుదైన శస్త్ర చి కిత్సలకు వేములవాడ ఏరియా దవాఖాన కేంద్రంగా మారింది. అత్యంత ఖరీదైన మోకీలు మార్పిడిని వైద్య బృందం విజయవంతంగా నిర్వహిస్తున్నది. ఈ మేరకు ఇటీవల నలుగురికి మోకీలు మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. బుధవారం వారిని నడిపించి ఆపరేషన్ విజయంతమైనట్టు వైద్యులు తెలిపారు. ఒకప్పుడు హైదరాబాద్లాంటి నగరాల్లో మాత్రమే మోకీలు మార్పిడి ఆపరేషన్ చేసే వారని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వేములవాడలో చేపట్టినట్టు వైద్యులు అనిల్కుమార్, తిరుపతి, శశి, సంతోష్చారి, వెంకట్ తెలిపారు. ఇప్పటివరకు తొమ్మిది మందికి శస్త్ర చికిత్సలు చేశామని వారు పేర్కొన్నారు.