వనపర్తి జిల్లా పెబ్బేరుకు సమీపంలోని బత్తుల ఆనంద్ అనే రైతు పొలంలో సంచరిస్తున్న కొండచిలువను శుక్రవారం వనపర్తికి చెందిన సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్ పట్టుకున్నారు.
పది అడుగుల పొడవున్న దీన్ని చాకచక్యంతో బంధించారు. దాన్ని నల్లమల అడవుల్లో వదిలివేయనున్నట్టు కృష్ణసాగర్ తెలిపారు.