హైదరాబాద్ సిటీబ్యూరో/చెన్నై, (నమస్తే తెలంగాణ) : ఐఐటీ మద్రాస్కు పూర్వ విద్యార్థులు, ఇతర దాతలు, కార్పొరేట్ సంస్థలు అనూహ్య రీతిలో భారీస్థాయిలో విరాళాల రూపంలో సాయం అందించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఏకంగా రూ.231 కోట్ల నిధులను సమకూర్చారు. సామాజిక బాధ్యతగా సంబంధిత ప్రాజెక్టులను అమలు చేయడం కోసం ఏటా ఇన్స్టిట్యూట్కు వచ్చే నిధుల కంటే భారీ మొత్తంలో విరాళాలను అందించారు. 2020-21లో రూ.101.2 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.131 కోట్లు, 2022-23 గాను రూ.231 కోట్ల సమకూర్చినట్లు ఐఐటీ మద్రాస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 2022-23లో విరాళాలు 76 శాతం పెరిగాయి. రూ.కోటి కంటే ఎక్కువ విరాళం ఇచ్చిన దాతల సంఖ్య 64 శాతం పెరిగిందని విద్యాసంస్థ తెలిపింది. పూర్వ విద్యార్థులు, దాతలు, కార్పొరేట్ సంస్థల నుంచి అందిన విరాళాలలను మౌలిక వసతుల కల్పన, స్కాలర్ షిప్లు, రీసెర్చ్ ఫండ్కు వినియోగించనున్నట్టుగా విద్యాసంస్థ వర్గాలు పేర్కొన్నాయి.