Viral Video | వికారాబాద్ : ఓ రైతు తన భార్యతో కలిసి ఎడ్ల బండిపై వెళ్తుండగా, దాని చక్రం ఊడిపోయింది. దారినా వెళ్లే వారెవరూ పట్టించుకోలేదు. అటుగా వెళ్తున్న ఓ పోలీసు.. రైతు పరిస్థితిని గమనించి తన కారును ఆపారు. ఇక రైతు వద్దకు వెళ్లి.. బండికి చక్రం ఎక్కించారు. అనంతరం తన కారులో వెళ్లిపోయారు. అందరూ చూసుకుంటూ వెళ్తున్నారు కానీ ఎవరూ సహాయం చేయలేదని రైతు పేర్కొన్నాడు. అయితే రైతుకు సహాయం అందించిన పోలీసు.. తాండూర్ పీఎస్లో ఏఎస్ఐగా పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఏఎస్ఐ పేరు గోపాల్.
రైతన్నకు సహాయం చేసిన పోలీసన్న
తాండూరులో ఎడ్ల బండిపై వెళుతున్న రైతు బండి చక్రం ఊడిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
అప్పుడే అటుగా వెళుతున్న తాండూరు పీఎస్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న గోపాల్ తన కారు పక్కన ఆపి ఎడ్ల బండి చక్రాన్ని సరిచేసి రైతుకు సహాయాన్ని అందించారు. pic.twitter.com/xDyS2gB4Vt
— Telugu Scribe (@TeluguScribe) April 2, 2024