హైదరాబాద్ : కామారెడ్డి(Kamareddy )జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్లో(Rama Reddy Police Station) మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. పీఎస్లోని ఫర్నీచర్ ధ్వంసం(Vandalized furniture) చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. రవి అనే వ్యక్తి మద్యం సేవిస్తూ తమని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తల్లిదండ్రులు రవిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో మద్యం మత్తులో ఉన్న రవిని పోలీసులు స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రవి స్టేషన్లో నానా హంగామా సృష్టించి పలు వస్తువులను ధ్వసం చేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.