మహబూబాబాద్ : మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్రేన్ వైర్ (Crane wire) తెగి పూడిక మట్టి మీదపడి ఓ వ్యక్తి మృతి(Person died) చెందాడు. ఈ విషాదకర సంఘటన నర్సింహులపేట మండలం నరసింహపురం బంజర గ్రామ పంచాయతీ పరిధిలోని పత్ని తండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తండాలోని ఓ వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ వైరు తాడు తెగి పూడిక మట్టి మీద గుగులోతు రవి (40 ) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. రవి మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.