జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 15 : గుండెపోటుతో తొమ్మిదేండ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రా మంలో గురువారం చోటుచేసుకున్న ది. జగిత్యాల అర్బన్ మండలం ధరూ ర్కు చెందిన బాలగంగాధర్-హరిత దంపతులకు ఇద్దరు కొడుకులు. వీరు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సాయంత్రం తిరుపతి దైవదర్శనానికి బయలుదేరారు. మొక్కులు చెల్లించి తిరిగి బుధవారం అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు. ఆ వెంటనే చిన్న కొడుకు బాలె హర్షిత్ (9) గుండెపోటుతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించే లోపే మృతి చెందాడు. గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న హర్షిత్ చనిపోయాడని తెలుసుకున్న తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.