పెబ్బేరు, ఫిబ్రవరి 6: కుటుంబ కలహాలతో మనస్తా పం చెందిన ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకింది. స్థానికుల చొరవతో బాలుడు ప్రా ణాలతో బయటపడగా.. తల్లి, ఇద్దరు కూతుళ్లు నీటిలో గల్లంతయ్యారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరులో ఆదివారం రాత్రి చోటుచేసుకొన్నది. పెబ్బేరుకు చెందిన స్వామి, భవ్య (32) దంపతులు. వీరికి జ్ఞానేశ్వరి (5), వరుణ్ (4), నిహారిక (1) సంతానం. ఆదివారం రాత్రి కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన భవ్య పిల్లలతో కలిసి ఇంట్లోంచి బయటికి వెళ్లింది. సమీపంలోని జూరాల ప్రధాన ఎడమ కాలువలో దూకింది. అక్కడే ఉన్న కుమార్ అనే యువకుడు బాబును కాపాడాడు. తల్లీకూతుళ్లు కాలువలో గల్లంతయ్యారు. పోలీసులు కాలువ వద్దకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.