Vikarabad | పెద్దేముల్, మార్చి 20: ఇంటి నిర్మా ణం కోసం లోన్ తీసుకుందామని బ్యాం కుకు వెళ్లిన ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. తన పేరిట ఏకంగా 38 బ్యాంకు అకౌంట్లు ఉన్నట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన మంగళి అనంతయ్య మంగళి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇటీవల తన కొత్త ఇంటి నిర్మాణ పనులను 50 శాతం పూర్తి చేశాడు. మిగతా నిర్మాణానికి లోన్ కావాలని స్థానిక ఐఐఎఫ్ఎల్ బ్యాంకుకు వెళ్లాడు.
అతను ఇచ్చిన పత్రాలు పరిశీలించిన సిబ్బంది, అతని పేరిట మొత్తం 38 అకౌంట్లు ఉన్నాయని, అందులో 12 అకౌంట్లు యాక్టివ్లో, మిగతా 26 క్లోజ్ అయ్యాయని, ఓ మోపెడ్ లోన్ కూడా ఉందని బ్యాంకు సిబ్బంది చెప్పారు. దీంతో మొగిలయ్య ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. సోమవారం పోలీసులను ఆశ్రయించాడు. తనకు తెలియకుండా గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో తన ధ్రువపత్రాలు, ఫోన్ నంబర్ వాడి బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేశారని, లోన్ కూడా తీసుకున్నారని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు.