రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో(Vemulawada) దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని భగవంత నగర్లో సిర్రం మహేశ్ (46) అనే వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder) గురయ్యాడు. మృతుడిది ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంగా గుర్తించారు. గత కొన్ని సంవత్సరాలుగా వేములవాడలో కూలి పని చేస్తూ ఉపాధి పొందుతున్న మహేశ్ రాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగిన తరుణంలో గొడవ జరిగినట్లుగా సమాచారం. సమాచారం అందుకున్న వేములవాడ పట్టణ ఇన్చార్జి సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.