హైదరాబాద్ : ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder) గురయ్యాడు. ఈ విషాదకర సంఘటన నల్లగొండ(Nallgonda) జిల్లా కొండమల్లేపల్లి మండలం అంబోతు తండాలో(Ambothu tanda) చోటు చేసుకుంది. విరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన జగ్గు అనే వ్యక్తి ఆరుబయట నిద్రిస్తుండగా గుర్తు తెలయని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీంను రప్పించి విచారణ వేగవంతం చేశారు. జగ్గు మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.