Telangana | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వాంకిడి మండలం కమానలోభూ వివాదాలతో సొంత అన్న, వదిననే ఓ తమ్ముడు దారుణంగా గొడ్డలితో నరికి చంపేశాడు. తన ఇద్దరు కుమారుల సాయం తీసుకుని మరీ తమ్ముడు ఈ దురాగతానికి ఒడిగట్టాడు.
మృతులను దస్రు (50), బైనాబాయి(45)గా గుర్తించారు. కాగా, హత్య అనంతరం వాంకిడి పోలీస్ స్టేషన్కు వెళ్లి నిందితులు లొంగిపోవడం గమనార్హం.