జోగులాంబ గద్వాల : పెళ్లి వేడుకల్లో 30 తులాలు బంగారం ఆభరణాలను(Gold ornaments) గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన(Theft) సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. గద్వాల మండలం బీరెల్లి గ్రామానికి చెందిన కృష్ణ వర్ధన్ రెడ్డి గద్వాలలో నివాసం ఉంటున్నాడు. వారి సోదరుడు కుమారుని పెళ్లి జిల్లా కేంద్రంలోని ఎస్వీ హెవెంటాలో నిర్వహించారు.
రాత్రి ఫంక్షన్ అయినా అనంతరం కుటుంబ సభ్యులతో ఫంక్షన్ హాల్ లోనే నిద్రించారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫంక్షన్ హాల్లోకి చొరబడి బంగారు నగలు ఉన్న బ్యాగును తీసుకెళ్లారు. ఉదయం లేచిన అనంతరం బంగారం కలిగి ఉన్న బ్యాగు కనిపించకపోవడంతో పట్టణ పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.