జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బొగ్గు(Coal) పెల్లలు మీద పడి లారీ డ్రైవర్(Lorry driver) అక్కడికక్కడే మృతి(Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన గణపురం మండలం కేటీపీలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బుర్ర కొమురయ్య అనే లారీ డ్రైవర్ మృతి కేటీపీలో బొగ్గులోడుతో వెళ్లిన ఆయన అన్లోడ్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బొగ్గు పెల్లలు మీద పడ్డాయి. దీంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కొమురయ్య మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.