జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లాలోని ధరూర్ మండలం ర్యాలంపాడు గ్రామ శివారులో గల వ్యవసాయ పొలంలో(Agricultural field) భారీ మొసలిని(Huge crocodile) సోమవారం గ్రామస్తులు గుర్తించారు. ర్యాలంపాడు రిజర్వాయర్లో (Ryalampadu Reservoir) నీళ్లు అడుగంటడంతో రిజర్వాయర్ నుంచి గ్రామ శివారులో గల రంగారెడ్డి అనే రైతు వ్యవసాయ పొలంలో ముండ్ల చెట్ల పొదలలో మొసలి ప్రత్యక్షమైంది. స్థానికులు చూసి భయాందోళనకు గురై వెంటనే డీఎఫ్వో అధికారులకు సమాచారం అందించారు. వారు మొసలిని బంధించి జూరాల ప్రాజెక్టులో విడిచిపెట్టారు. మొసలి బరువు 130 కిలోల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.