హైదరాబాద్ : తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఒక గ్రే హౌండ్ జవాన్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే జవాన్కు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జవాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. జవాన్ మధు ఛాతీలోకి దూసుకెళ్లిన బుల్లెట్ను వైద్యులు బయటకు తీశారు. జవాన్ మధును డీజీపీ మహేందర్ రెడ్డి, గ్రే హౌండ్స్ చీఫ్ శ్రీనివాస్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్, ఐజీ ప్రభాకర్ రావు పరామర్శించారు.
ములుగు ఎస్పీ సంగ్రామ్సింగ్ జి పాటిల్ వెల్లడించిన వివరాల ప్రకా రం.. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లోని రాజకీయ నాయకులు, సర్పంచ్లు, కాంట్రాక్టర్లను అపహరించి హత్య చేయాలని సీపీఐ మావోయిస్టు గ్రూప్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పెద్ద ఎత్తున వ్యూహం పన్నింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 16 నుంచి ఛత్తీస్గఢ్ పోలీసులు, సీఆర్పీఎఫ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ములుగు-బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన ఛత్తీస్గఢ్లో కూంబిం గ్ నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము న కర్రిగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. ముగ్గు రు మావోయిస్టులు మృతి చెందారు.
ఆ ప్రాంతంలో గాలించగా ఒక ఎస్ఎల్ఆర్, ఒక ఎన్సాస్ రైఫిల్, ఒక సింగిల్బోర్ వెపన్, 10 రాకెట్ లాంచర్లు ఇతర వస్తువులు లభించాయి. మృతి చెందిన వారి వివరా లు తెలియాల్సి ఉన్నది. ఇందులో నల్లగొండ జిల్లాకు చెందిన మధు అనే గ్రేహౌండ్స్ కానిస్టేబుల్కు బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. మధును చికిత్స నిమిత్తం వరంగల్కు, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు.