హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 74వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ శనివారం ఘనంగా జరిగింది. పరేడ్కు ఈ బ్యాచ్లోనే ఆల్రౌండర్గా నిలిచిన కేరళ క్యాడర్ ట్రైనీ ఐపీఎస్ కేఎస్ శహాన్ష నాయకత్వం వహించారు. ఉత్తమ ట్రైనీలకు కేంద్ర హోంమంత్రి అమిత్షా అవార్డులు ప్రదానం చేశారు. ట్రైనీ ఐపీఎస్ల కవాతు, ఎన్పీఏ పోలీస్ బ్యాండ్ అద్భుతమైన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.