హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ డి మాండ్ చేశారు. బుధవారం సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తీసుకోవాల్సిన అప్పు కన్నా రూ.15,139 కోట్ల అప్పు ఎక్కువగా చేసిందని వెల్లడించారు. పేదల భూ ము లు లాక్కోవడానికే సీఎం రేవంత్రెడ్డి రేడియ ల్ రోడ్ల పేరిట భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్ లేని చోట ఫ్యూచర్ సిటీ కడతామని చెబుతున్నారని చురకలటించారు. నాడు జీతాలు పెంచాలని ఆశావర్కర్లు దీక్ష చేస్తే వాళ్ల దగ్గరికి సీతక్క వెళ్లి తాను మాజీ నక్సలైట్ అని, మీ కష్టాలన్నీ తెలుసని నమ్మిం చారని గుర్తుచేశారు.
మీ సమస్యలు పరిష్కరించేందుకే రేవంత్రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.18వేలు పెంచుతామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ప్రస్తుతం మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని మండిపడ్డారు. దాదాపు 5 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలు లేవని ఆందోళన వ్యక్తంచేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక 86మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు బయటకు రాకుండా ఆంధ్ర వ్యక్తి శ్రీరామ్ను మీడియా అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్గా నియమించి మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వంలో అడ్వైజర్లుగా 8మంది ఆంధ్రవాళ్లను నియమించడం ఏమి టని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ జరిగే పరిస్థితి లేదని, కేవలం సెటిల్మెంట్ చేసుకోవడానికే మధు పార్క్ రిట్జ్ సహా పది వేల మందికి నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. పేద ప్రజల ఇండ్ల కూల్చివేతలు బూచిగా చూపి పెద్దల వద్ద భారీగా సెటిల్మెం ట్లు చేసుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇళ్లు చెరువులో ఉంటే దాని జోలికి హైడ్రా వెళ్లడం లేదని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్లో ఉంటే కూలగొట్టడం లేదని ఆయన ఆరోపించారు.