కరీంనగర్ కార్పొరేషన్, అక్టోబర్ 17: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బేతిగల్కు చెందిన ఇడమల్ల రమేశ్ (38) కిడ్నీ సంబంధ వ్యాధి బారినపడి 3 నెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. అతడి దయనీయస్థితిని చూసి భార్యాబిడ్డలు తల్లడిల్లుతున్నారు. కూలీ పనిచేస్తేగానీ ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్న తాము డయాలసిస్ చికిత్స చేయించేదేలా అని ఆందోళనకు గురవుతున్నారు. దాతలు దయతలిచి ఆపన్నహస్తం అందించాలని వేడుకొంటున్నారు. సాయం చేయాల్సిన వారు ఫోన్పే నంబర్ 9440180930లో నగదు జమ చేయాలని కోరుతున్నారు. 18 ఏండ్ల కింద రమేశ్ బతుకు దెరువుకోసం కరీంనగర్కు వలస వెళ్లాడు. ఇతడికి భార్య కోమల, కొడుకు మణిదీప్, 9 నెలల పాప హనీ ఉన్నారు. రమేశ్ వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకొంటున్నాడు. 4 నెలల కింద రమేశ్ తీవ్ర అనారోగ్యం బారినపడ్డాడు.