యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్టలోని గండిచెరువులో స్నానం చేస్తూ ఓ భక్తుడు ప్రమాదవవాత్తు మృతి చెందాడు. మృతుడు సికింద్రాబాద్లోని అల్వాల్కు చెందిన భువనేశ్వర్(19)గా గుర్తించారు. కాగా, మరమ్మతుల కారణంగా లక్ష్మీపుష్కరిణిని మూసివేయడంతో గత ఐదు రోజులుగా భక్తులు గండిచెరువులో పుణ్యస్నానాలు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.