హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ( Congress ) రాక్షస రాజ్యం నడుపుతోందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ( Rakesh Reddy ) ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ( Farmers Issues ) వరంగల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ప్రశ్నిస్తే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ అమలు చేయకపోతే రైతులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి చేతగాని దద్దమ్మళ్ల కేసులు పెడుతు భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,మంత్రులు ఐకేపీ సెంటర్ల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడితే సమస్య అర్ధమవుతుందిన సూచించారు.
రైతులను కాపాడుకోవడానికి ఎన్ని కేసులకైనా కేటీఆర్ సిద్దమని తెలిపారు. తెలంగాణ ద్రోహులపై కేటీఆర్ దురందరుడిలాగా పోరాటం చేస్తున్నారని వివరించారు. బిచ్చగాళ్లకు వేసినట్లు రైతు బంధు వేస్తున్నారు. అన్ని పంటలకు బోనసని ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దిగజారిందని పేర్కొన్నారు.కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అవినీతి అక్కడ ఉంటుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపైనర్ కాదు. స్టార్ డిస్ట్రిబ్యూటరని అన్నారు.