వికారాబాద్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. కాగా, భార్యభర్తలిద్దరు మాగ్నా నదిలో కొట్టుకుపోయి మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. బషీరాబాద్మండల పరిధిలోని మంతటి గ్రామానికి చెందిన సిద్ధప్ప దంపతులు కూరగాయలు అమ్మేందుకు కాగ్నా నది అటువైపు ఉన్న చంద్ర కొంచెం గ్రామానికి వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో వరద ఉధృతికి కాగ్నా నదిలో కొట్టుకుపోయారు.
కర్నాటక రాష్ట్రం జెట్టూరు గ్రామం వద్ద వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. సిద్ధప్ప దంపతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.