రంగారెడ్డి : బైక్(Bike)ను టిప్పర్ ఢీ కొనడంతో(Road accident) ఓ ఇంజినీర్(Civil engineer) దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన పహాడీషరీఫ్ పరిధి ఇమాంగూడ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్లోని గుంటి జంగయ్య కాలనీకి చెందిన ఆంజనేయులు ఓ ప్రైవేటు సంస్థలో సివిజ్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. కాగ, తన స్వస్థలం నాగర్ జిల్లా బల్మూరు మండలం కొండనాగుల వెళ్తుండగా ఆంజనేయులు బైక్ను టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.