హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో చదువకుండా హాజరు మిహాయింపు ద్వారా ఇంటర్ పరీక్షలు రాసే అవకాశాన్ని ఇంటర్బోర్డు కల్పించింది. నేరుగా పరీక్ష ఫీజు చెల్లించి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే అవకాశానిచ్చింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించి, ఈ నెల 20 నుంచి నవంబర్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.200 ఆలస్య రుసుముతో నవంబర్ 30 వరకు అవకాశం ఉన్నది. ఇది ఆర్ట్స్, హ్యుమానిటీస్ గ్రూపులకు మాత్రమే వర్తిస్తుంది. దీంతో అదనపు సబ్జెక్టుగా సెకండ్ లాంగ్వేజ్, బైపీసీ విద్యార్థులు మ్యాథమేటిక్స్ను చదివే అవకాశం కల్పించారు.