బంజారాహిల్స్, జనవరి 23: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి ఫోన్ చేసి దుర్భాషలాడిన ఘటనలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో వివిధ పార్టీల నాయకులతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సమావేశమయ్యా రు.
ఈ క్రమంలో బీఆర్ఎస్కు చెందిన కొంతమంది సర్పంచ్లు, నాయకులను పిలిపించుకొన్నారు. ఈ విషయం తెలుసుకొన్న ఎంపీ రంజిత్రెడ్డి ఈ నెల 17న విశ్వేశ్వర్రెడ్డికి ఫోన్ చేసి నిలదీశారు. తనమీద అభ్యంతరకరమైన రీతిలో మాట్లాడిన రంజిత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని 20న విశ్వేశ్వర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతి తీసుకొన్న బంజారాహిల్స్ పోలీసులు రంజిత్రెడ్డిపై ఐపీసీ 504 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.