హైదరాబాద్ : జగిత్యాల(Jagithyala) జిల్లా మెట్పల్లి జడ్పీటీసీ(Metpally ZPTC) భర్త కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. గతంలో బీఆర్ఎస్ కార్యకర్త(BRS activist) గొర్రె మల్లేశంపై జడ్పీటీసీ భర్త దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు కల్వకుంట్ల సంజయ్, బాజిరెడ్డి గోవర్దన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు(Case registered) చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేది. లేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని వారు తెలిపారు.