నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 22 : నిర్మల్(Nirmal) జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్పై(Head constable) కేసు నమోదైనట్లు ఎస్పీ జానకి షర్మిల(janaki sharmila) తెలిపారు. నర్సాపూర్ గ్రామానికి చెందిన జగత్రాం జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఔట్ పోస్టుగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వ దవాఖానలో ఓ యువతితో(Young woman) అసభ్యంగా(Misbehaving) ప్రవర్తించచాడు.
దీంతో బాధిత యువతి హెడ్ కానిస్టేబుల్ తీరుపై బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అతడిపై విచారణ చేపట్టిన అధికారులు గురువారం హెడ్ కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఎవరైనా మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.