హైదరాబాద్ : ఎన్నికల కోడ్(Election Code) ఉల్లంఘించారని కొత్తగూడెం(Kothagudem) సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై(MLA Kunamneni Sambasiva Rao) కేసు నమోదు అయింది. ఎమ్మెల్యే కూనంనేని ఎలాంటి అనుమతులు లేకుండా మీటింగ్ పెట్టి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీఎస్పీ నేత ఎర్ర కామేష్ ఈసీకి కూనంనేనిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పాల్వంచ ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి ఆదేశాలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కూనంనేనిపై 188, 171-సీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.