నర్పింహులపేట, మార్చి 25 : హోలి (Holi) ఆడి స్నానం చేయడం కోసం చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి బాలుడు మృతి(Boy died) చెందిన విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట (Narsimhulapeta) మండలంలో రామన్నగూడెం చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన అబ్బోరి వినోద్ రెడ్డి కుమారుడు రిత్విక్రెడ్డి(10) మండల కేంద్రంలోని సాయికృష్ణ హైస్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు.
హోలీ పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి రంగులు చల్లుకున్నారు. అనంతరం స్నానం చేసేందుకు గణేశ్ చెరువు వద్దకు వెళ్లాడు. రంగులు కుడుక్కుంటుండగా కాలు జారి చెరువులోని గుంతలో పడిపోయాడు. దీంతో అతని స్నేహితులు భయంతో వచ్చి గ్రామంలో చెప్పడంతో గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూసేసరికి రిత్విక్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీశ్ తెలిపారు.