సిద్దిపేట : ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు ఓ వరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ క్రిస్టియన్ భవన్ ఆవరణలో గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిరుపేదలు సాయం పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తుందన్నారు. అందుకు గజ్వేల్ నియోజకవర్గమే నిదర్శనమన్నారు. చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ, క్రైస్తవ మత ప్రతినిధి రూబెన్, స్థానిక ప్రజా ప్రతినిధులు, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.