ఆదిలాబాద్ : అడవుల జిల్లా ఆదిలాబాద్ ప్రకృతి సోయగాలకు నెలవు. దట్టమైన అడవులు, పక్షుల కిలకిలారావాలతో అలరించే జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది.
జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి భారీగా మంచు కురిసింది. చిరుజల్లులు కూడా పడుతుండటంతో వాతావరణం ఒక్కసారి చల్లబడింది.
చల్లటి వాతావరణం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు, ఆఫీసులకు వెళ్లే వాళ్లు ఇబ్బందిపడుతున్నారు.
ఉదయం పది దాటినా భానుడు కనిపించడం లేదు. మంచు కారణంగా జిల్లాలోని జాతీయ రహదారి 44 తోపాటు ఇతర రోడ్లపై వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్లాల్సి వస్తున్నది.