Jagtial | జగిత్యాల : రాష్ట్ర వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. శివాలయాలన్నీ శివ నామస్మరణలతో మార్మోగిపోతున్నాయి. ఆలయాలకు వెళ్లలేని వారు ఇంట్లోనే తమ పూజా మందిరాల్లో ప్రత్యేక పూజలు చేసి, తమ భక్తిని చాటుకుంటున్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురిలో మహా శివరాత్రి పర్వదినం రోజున ఓ ఇంట్లోకి పిచ్చుక ప్రవేశించింది. ఆ తర్వాత అది నేరుగా పూజా మందిరంలోకి వెళ్లింది. ఆ మందిరంలో పిచ్చుక చాలా సేపు కూర్చొని ధ్యానంలో నిమగ్నమైంది. దీంతో ఆ ఇంటి కుటుంబ సభ్యులు పరవశించిపోయారు. శివరాత్రి రోజున పిచ్చుక అలా ధ్యానంలో కూర్చోవడం తమకెంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించిందని వారు పేర్కొన్నారు.