హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫలితాల్లో కేజీబీవీ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ప్రతిభ చాటారు. ఎం అనూష ఎంపీసీలో 988 మార్కులు, బైపీసీలో జీ గంగాభవాని 987తో టాపర్లుగా నిలిచారు. ఎంపీసీలో ఆదిలక్ష్మి 983, ఎస్కే మున్నీ 982, రామనీల 982, కే తేజస్విని 981 మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో ఎం పావని 467, ఎం లావణ్య 464, జే అను 464 మార్కులు సాధించారు.