హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 970 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.47,55,642 ఉంటుందని చెప్పారు. బంగారాన్ని పేస్టుగా మార్చి మోకాలు కింది భాగంలో అతికించుకున్నాడని తెలిపారు. అతడిని ఆదీనంలోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు.