హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : టీఎస్ ఈసెట్ మొదటి విడత కౌన్సెలింగ్లో 82శాతం సీట్లు భర్తీ అయ్యాయి. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్లో ల్యాట్రల్ ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్లో మంగళవారం సీట్లు కేటాయించారు. ఈ ఏడాది ఈసెట్లో 20,895 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో 12,953 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరుకాగా, 12,880 మంది వెబ్ఆప్షన్లు ఎంచుకొన్నారు. ఇంజినీరింగ్లో 11,698, ఫార్మసీలో 1,213 సీట్ల చొప్పున మొత్తం 12,911 సీట్లున్నాయి. ఇంజినీరింగ్లో 9,680 సీట్లు భర్తీ అయ్యాయి. ఫార్మసీలో 74 సీట్లు నిండాయి. మరో 3,200 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నా.. వారు కోరుకొన్న కాలేజీల్లో సీట్లు లేకపోవడంతో సీట్లు దక్కించుకోలేకపోయారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 12లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు.