హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఫస్టియర్ విద్యార్థులకు సంస్కృతం, హిందీ, తెలుగు, ఉర్దూ, అరబిక్ భాషలకు పరీక్షలు నిర్వహించారు. మొదటిరోజు 95శాతానికిపైగా విద్యార్థులు పరీక్ష రాసినట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ తెలిపారు.
నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ తదితర జిల్లాల్లో పరీక్షల నిర్వహణ తీరును అధికారులు పరిశీలించినట్టు వెల్లడించారు. పరీక్ష సజావుగా జరిగినట్టు పేర్కొన్నారు. కాగా, గురువారం నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. సంస్కృతం, హిందీ, తెలుగు, ఉర్దూ, అరబిక్ భాషలకు పరీక్షలు నిర్వహిస్తారు.