ములుగు : ములుగు జిల్లాలోని ఓ రెండు మద్యం షాపులకు భలే డిమాండ్ ఉంది. ఆ మద్యం షాపులను దక్కించుకునేందుకు నలుగైదురు కాదు.. ఏకంగా 94 మంది పోటీ పడుతున్నారు. మరి ఎవరికి అదృష్టం వరిస్తుందో వేచి చూడాల్సిందే. గోవిందరావుపేట మండలం పసర, తాడ్వాయి మండలం మేడారం, ఊరట్టం గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసే రెండు మద్యం దుకాణాలకు 94 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శశిధర్ రెడ్డి తెలిపారు.
పసరలో ఏర్పాటు చేసే గెజిట్ నెంబర్ 61వ షాపుకు 56 దరఖాస్తులు, మేడారంలో ఏర్పాటు చేసే గెజిట్ నెంబర్ 62వ షాపుకు 38 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి రూ. కోటి 88 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆయన తెలిపారు. ఈ రెండు మద్యం దుకాణాలకు శుక్రవారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లక్కీడ్రా ద్వారా షాపులను కేటాయించనున్నారు.