నల్లగొండ : మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మండలం తుఫ్రాన్ పేట చెక్ పోస్ట్ వద్ద రూ. 93 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును హైదరాబాద్ నుంచి మునుగోడుకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నగదు తరలిస్తున్న వ్యక్తి నామ్ దేవ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
బీజేపీ నేత వివేక్ కారు డ్రైవర్ ఐలయ్య యాదవ్ సూచన మేరకు డబ్బు తీసుకెళ్తున్నట్లు నామ్దేవ్ పోలీసులు తెలిపారు. శేరిలింగంపల్లిలో ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరుడి నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నామ్ దేవ్ డబ్బు తీసుకున్నాడు. ఆ తర్వాత కారు స్టెఫ్నీ కింద డబ్బును అమర్చి తరలిస్తున్నాడు. అయితే రూ. 93 లక్షలు తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆ వాహనాన్ని తనిఖీ చేసి నగదును సీజ్ చేశారు.