షాద్నగర్/రంగారెడ్డి : రాష్ట్రంలోని 30 వేల చెరువుల్లో 93 కోట్ల ఉచిత చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం వదిలిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలిన సందర్భంగా మంత్రి మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటల్లో జల కల సంతరించుకుందన్నారు. ఇప్పటికి 5 విడుతల్లో ఉచిత చేప పిల్లలను చెరువుల్లో వదిలామని చెప్పారు. మిషన్ కాకతీయతో గ్రామాల్లో మత్స్య సంపద పెరిగిందని అభిప్రాయపడ్డారు.
ఉమ్మడిరాష్ట్రంలో మత్స్య కార్మికులు సంక్షేమాన్ని విస్మరించనప్పటికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశాలను కల్పించడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. ప్రతి యేటా రూ. 89 కోట్ల నిధులతో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ మత్స్య రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
అదేవిధంగా రూ. 25 కోట్ల నిధులతో 10 కోట్ల రోయ్య పిలల్లను సుమారు 200 చెరువుల్లో పెంతున్నామని వివరించారు. రంగారెడ్డి జిల్లాలో 836 చెరువుల్లో రూ. 1.25 కోట్ల నిధులను వెచ్చించి 1.72 కోట్ల చేప పిల్లలను ఆయా గ్రామాల్లో ఉన్న చెరువుల్లో, కుంటల్లో పెంచుతున్నామని అన్నారు. ప్రతి చెరువును జియో ట్యాగ్ చేసి పరిరక్షిస్తున్నారని, చేపల పెంపకంతో ముదిరాజులు, బెస్తలు, మత్స్య కార్మికులు ఉపాధి పొందాలని కోరారు.
గత ఐదేండ్లలో రూ. 208 కోట్ల నిధులను చేపల పెంపకానికి వినియోగిస్తే రూ. 30 వేల కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మధు, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, మత్స్య కార్మికులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
‘ఉపాధి’ పనుల్లో వికారాబాద్ అగ్రస్థానం : హర్షం వ్యక్తం చేసిన ఎంపీ రంజిత్ రెడ్డి
Raai Laxmi | అదిరే అందాలతో కైపెక్కిస్తున్న రాయ్ లక్ష్మీ..
T20 World Cup | న్యూజిల్యాండ్ మ్యాచ్లో అతనే కీలకం.. చివరి వరకూ బ్యాటింగ్ చేయాలి : ఆకాశ్ చోప్రా