దుబాయ్: టీ20 ప్రపంచకప్(T20 World Cup)లో కీలక సమరానికి సమయం వచ్చేసింది. ఒకే ప్రత్యర్థి చేతిలో ఓటమి చవిచూసిన రెండు జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. ఆదివారం నాడు భారత్, న్యూజిల్యాండ్ జట్లు తలపడుతున్నాయి. పాకిస్థాన్ చేతిలో ఓడిన ఈ రెండు జట్లు కూడా విజయం కోసం తహతహలాడుతున్నాయి.
ఈ క్రమంలో ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన భారత్ మరింత పట్టుదలగా కనిపిస్తోంది. దీనిపై మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడాడు. భారత జట్టులో ఎక్స్ ఫ్యాక్టర్ రిషభ్ పంత్ అని, అతను భారత ఇన్నింగ్స్ చివరి వరకూ బ్యాటింగ్ చేయాలని ఆకాశ్ అభిప్రాయపడ్డాడు.
‘పాండ్యా ఫామ్లో లేడు. అతను ఫామ్లోకి రావాలని మనమంతా కోరుకుంటున్నాం. కానీ డెత్ ఓవర్లలో బ్యాటింగ్ చేయాలంటే పంత్ కన్నా బెటర్ ఆప్షన్ మరొకటి లేదు’ అని అతను చెప్పాడు.