నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 11: ఎన్నికల వేళ అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. బుధవారం పలుచోట్ల వాహనాలను తనిఖీ చేయగా 93.90 లక్షల నగదు పట్టుబడింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి వద్ద పోలీసులు వాహనాలు సోదా చేస్తుండగా ఓ వ్యక్తి వద్ద రూ.50 లక్షలు పట్టుబడ్డాయి. మంచిర్యాల జిల్లాలో రూ.12 లక్షలు, జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలికోట శివారులో రూ.6.60 లక్షలు, మహబూబ్నగర్లో రూ.11.10 లక్షలు, వనపర్తి జిల్లాల్లో రూ.14.20 లక్షల నగదు లభించింది.