TS Polycet 2023 | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన టీఎస్ పాలీసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రవేశ పరీక్షకు 92.94 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 296 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
పాలీసెట్ ప్రవేశ పరీక్షకు 58,520 మంది బాలురు, 47,222 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు. 54,700 మంది బాలురు, 43,573 మంది బాలికలు పరీక్షకు హాజరయ్యారు. మొత్తంగా 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా, 98,273 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు.