హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల భర్తీపై విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. విభాగాల వారీగా లెక్కలు తీస్తున్నది. 9 వేలకుపైగా పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అవకాశమున్నట్టు అధికారులు తేల్చారు. ఈ ఏడాది ప్రభుత్వం భర్తీచేసే 50 వేల ఉద్యోగాల్లో 20 శాతం వరకు విద్యాశాఖకు నుంచే ఉండనున్నాయి. శాఖలవారీగా ఖాళీలను గుర్తించిన అధికారులు ఓ నివేదికను తయారుచేసి సీఎస్ సోమేశ్కుమార్కు సమర్పించారు. ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చి, ఆర్థికశాఖ అనుమతిస్తే నోటిఫికేషన్ల ద్వారా ఈ పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిలో 7 వేల పైచిలుకు బోధన, మరో 2 వేలవరకు బోధనేతర సిబ్బంది పోస్టులున్నట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోస్టుల సంఖ్య మారవచ్చని చెప్తున్నారు.